Sunday, 11 February 2018

డిసెంబర్ 2017 జాతీయం

కేంద్ర విభాగాల్లో 4.12 లక్షల ఖాళీలు

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2016, మార్చి 1 నాటికి దాదాపు 4.12 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం డిసెంబర్ 20న లోక్‌సభకు తెలిపింది. కేంద్ర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాల వార్షిక నివేదిక’ ప్రకారం 2016 మార్చి నాటికి మొత్తం 36.33 లక్షల ఉద్యోగాలకు గానూ 4.12 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి’ అని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. కేంద్ర సర్వీసుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. రైల్వేశాఖ భద్రతా విభాగంలో 2017, ఏప్రిల్ నాటికి 1.28 లక్షల ఖాళీలు ఉన్నాయి.

వడోదరలో తొలి రైల్వే వర్సిటీదేశంలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో నేషనల్ రైల్ అండ్ ట్రాన్‌‌సపోర్ట్ యూనివర్సిటీ(ఎన్‌ఆర్‌టీయూ) పేరిట దీన్ని నెలకొల్పాలని డిసెంబర్ 20న ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించినట్లయింది. కంపెనీల చట్టం-2013 ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ నెలకొల్పే లాభాపేక్ష లేని కంపెనీ ప్రతిపాదిత యూనివర్సిటీని నిర్వహిస్తుంది. వర్సిటీకి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు చాన్‌‌సలర్, ఇతర ముఖ్యమైన బోధనా సిబ్బందిని ఆ కంపెనీయే నియమిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. విద్య, పాలన విధులు నిర్వర్తించేందుకు స్వతంత్ర బోర్డును కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొంది. 


గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక అంతరాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి నదులను అనుసంధానం చేయడానికి జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సరికొత్త ప్రణాళిక రచించింది. అంతరాష్ట్ర జల వివాదాలు తలెత్తకుండా, ముంపు సమస్య లేకుండా.. తక్కువ ఖర్చుతో నాలుగు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం గోదావరి నదిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినెపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడ నుంచి 247 టీఎంసీలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. నాగార్జునసాగర్ నుంచి సోమశిల రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి తమిళనాడులోని కావేరీ గ్రాండ్ ఆనకట్టలోకి నీటిని తరలిస్తారు. 
మూడు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే.. నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది.


2జీ స్పెక్ట్రమ్ కేసులో అందరూ నిర్దోషులే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ డిసెంబర్ 21న ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మొత్తం 17 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి
ఓపీ సైనీ ఉద్ఘాటించారు. కొందరు కొన్ని వివరాలను తెలివిగా అటూఇటూ మార్చి ఏమీ లేని చోట స్కామ్ సృష్టించారు’’ అని అన్నారు. 
2జీ స్పెక్ట్రమ్ లెసైన్సుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ 2010లో కాగ్ నివేదిక ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ముందొచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన 8 కంపెనీలకు 122 2జీ స్పెక్ట్రమ్ లెసైన్సులు కేటాయించింది. ఈ విధానంతో ఖజానాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని, లెసైన్సులు పొందినవారికి అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ నివేదిక ఇవ్వడంతో దేశంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011లో ఆయన్ను సీబీఐ ఆరెస్ట్ చేసింది. 15 నెలలపాలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. 2012లో సుప్రీంకోర్టు సైతం 122 2జీ లెసైన్సులను రద్దు చేసింది.


యూపీలో కల్తీ సారా’కు మరణశిక్షకల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ డిసెంబర్ 22న ఆమోదించింది. యూపీ ఎకై ్సజ్(సవరణ) చట్టం-2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్‌లో ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్‌‌స తీసుకొచ్చింది.


ఢిల్లీ మెట్రో మెజెంటా మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ కొత్తగా నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న ప్రారంభించారు. అనంతరం.. యూపీ గవర్నర్ రామ్ నాయక్, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ పురీ తదితరులతో కలసి మోదీ మెట్రోరైలులో ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. పౌరులు వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ఇంధన వినియోగం తగ్గి, తద్వారా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చుతగ్గుతుందన్నారు. 


అభివృద్ధి ప్రాజెక్టులకు 56,070 హెక్టార్ల అటవీ భూములు గడిచిన మూడేళ్లలో (2014-15 నుంచి 2016-17 వరకు) దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 26న వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి 8వ స్థానంలో నిలిచింది. 
కాగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలసి ఈ మూడేళ్లలో 93,400 హెక్టార్లలోనే అడవులను పెంచాయి. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. ఆ మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా-2015 నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 21.60 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 18.80 శాతమే. ఏపీలో 24.42 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 15.25 శాతమే. 
ఇటీవల కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో 2013 నుంచి 2015 మధ్య 168 చదరపు కి.మీ. మేర (16,800 హెక్టార్ల మేర)అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. 


మణిపూర్‌లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇండియన్ సైన్‌‌స కాంగ్రెస్ సమావేశం మణిపూర్‌కు తరలిపోయింది. కోల్‌కతాలో డిసెంబర్ 27న సమావేశమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు ఏడు విశ్వవిద్యాలయాలు సమావేశాల నిర్వహణకు పోటీ పడ్డాయి. చివరికి మణిపూర్ విశ్వవిద్యాలయానికి ఈ అవకాశం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా తాము ఈ సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినప్పటికీ, అందుకు అసోసియేషన్ తిరస్కరించింది. 105వ ఇంటర్నేషనల్ సైన్‌‌స కాంగ్రెస్ 2018 మార్చి 18 నుంచి 22 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది. 
ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం 2017 జనవరి మూడు నుంచి ఏడు వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలతో సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకుంది. 


వలసల్లో మొదటి స్థానంలో భారత్ ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎక్కువగా ఉంటున్న వారి జాబితాలో భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 18న విడుదల చేసిన అంతర్జాతీయ వలస నివేదిక ప్రకారం- 1.7 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అత్యధికంగా గల్ఫ్ ప్రాంతంలో 50 లక్షల మంది నివసిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న దేశాలు యూఏఈ(30 లక్షలు), అమెరికా(20 లక్షలు), సౌదీ అరేబియా(20 లక్షలు). మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 25.8 కోట్ల మంది సొంత దేశంలో కాకుండా.. ఇతర దేశాల్లో నివసిస్తున్నారు. ఇది 2000 నాటితో పోల్చితే 49 శాతం ఎక్కువ. 

కంపెనీల చట్టం సవరణకు రాజ్యసభ ఆమోదం కంపెనీల చట్టం సవరణ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 19న ఆమోదించింది. ఇందులో దివాళా తీసే కంపెనీలపై కఠిన చర్యలు ప్రతిపాదించారు. కొత్తగా కార్పొరేట్ పాలనా ప్రమాణాల పటిష్టత, సరళతర వాణిజ్యానికి ఉపయోగపడేలా కొన్ని నిబంధనలు చేర్చారు. ఈ బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమోదించింది. 

బెంగళూరు నగరానికి అధికారిక చిహ్నం అధికారిక చిహ్నం (లోగో) రూపొందించుకున్న భారత్‌లోని తొలి నగరంగా బెంగళూరు ఘనతను సొంతం చేసుకుంది. కన్నడ, ఆంగ్ల లిపి కలగలిసిన ఈ లోగోనూ ఎరుపు, తెలుపు రంగులో రూపొందించారు. దీనిని కర్ణాటక పర్యాటక, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే డిసెంబర్ 24న ఆవిష్కరించారు. దీంతో న్యూయార్క్, మెల్‌బోర్న్, సింగపూర్ లాంటి సిటీల సరసన బెంగళూరు నిలిచింది. ఒక పోటీ నిర్వహించి ఈ లోగోను నిపుణుల బృందం ఎంపిక చేసింది. నమ్మూరుకి చెందిన డిజైనర్ వినోద్ కుమార్ చిహ్నాన్ని రూపొందించారు. ఇంగ్లిష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా డిజైన్ చేశారు. 


మార్చి 1 నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని విచారించేందుకు దేశవ్యాప్తంగా 2018 మార్చి నాటికి 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టుల్ని సంప్రదించి రాష్ట్రాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం డిసెంబర్ 14న ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదంట్రిపుల్ తలాక్ (తలాక్- ఇ-బిద్దత్) పై రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం డిసెంబర్ 15న ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం భర్త ముందస్తు సమాచారం లేకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసి, భార్యకు విడాకులు ఇవ్వటం నేరం. అందుకు గాను భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేట్లు బిల్లును రూపొందించారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ముసాయిదాను తయారు చేసింది. ఈ ఉప సంఘంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్, సహాయ మంత్రి పీపీ చౌదరి సభ్యులుగా ఉన్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
  • రెండు వేలలోపు డెబిట్ కార్డులు, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీల చార్జీలైన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఆమోదం.
  • జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం) అమలును 2020 వరకు పొడిగిస్తూ రూ.2,400 కోట్లు కేటాయిపుంచింది.


ఆగ్నేయాసియా గేట్‌వేగా మిజోరాం : మోదీ మిజోరం రాష్ట్రంలోని కొలాసిబ్ ప్రాంతంలో నిర్మించిన 60 మెగావాట్ల తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టుని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 16న ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోం రైఫిల్స్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రసంగించిన మోదీ.. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్‌‌సపోర్ట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విసృ్తత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్‌‌స వంటి 10 ఆసియన్ కూటమి దేశాలకు మిజోరాం ముఖద్వారంగా మారనుందని చెప్పారు.



దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిదివ్యాంగులకు ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే అన్ని ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో 5 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టం -2016, సెక్షన్ 32 పరిధిలోకి వచ్చే అన్ని విద్యాసంస్థలు ఏటా ఈ నిబంధనను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.

ఆధార్ గడువు మార్చి 31 వరకు పొడిగింపుప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుంది.


కులాంతర వివాహానికి రూ. 2.5 లక్షల ప్రోత్సాహం కుల విబేధాలను రూపుమాపే దిశగా కులాంతర వివాహాలను ప్రోత్సహించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 5న సవరించింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న వార్షికాదాయ పరిమితి నిబంధనను తొలగించింది. తాజా సవరణ ప్రకారం.. ఇకపై కులాంతర వివాహం చేసుకునే వారిలో ఒకరు దళితులైతే వారికి కేంద్రం నుంచి రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా లభిస్తుంది. 

కుంభమేళాకు సాంస్కృతిక వారసత్వ సంపద గుర్తింపు 
ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో కుంభమేళాను డిసెంబర్ 7న సాంస్కృతిక వారసత్వ సంపద’గా గుర్తించింది. ఈ మేరకు దక్షిణ కొరియాలోని జెజూలో డిసెంబర్ 4 నుంచి 9 వరకు జరిగిన సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 12వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు శాంతియుతంగా హాజరయ్యే సమ్మేళనమే కుంభమేళా. 


హైకోర్టుల్లో 40 లక్షల పెండింగ్ కేసులుదేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో దాదాపు 40.15 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో గత పదేళ్లకు సంబంధించినవే 5,97,650 కేసులున్నాయి. ఈ మేరకు 24 హైకోర్టులకు సంబంధించి 2016 చివరి వరకు పెండింగ్‌లో ఉన్న కేసులపై నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం పెండింగ్ కేసుల్లో చివరి పదేళ్లకు సంబంధించిన కేసుల శాతం 19.45గా ఉండగా ఒక్క బాంబే హైకోర్టులోనే లక్షకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


గణతంత్ర వేడుకలకు 10 దేశాల అధినేతలుజనవరి 26న నిర్వహించే భారత 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పది ఆగ్నేయాసియా దేశాల అధినేతలను ఆహ్వానించనున్నారు. 60 ఏళ్లుగా ప్రతి గణతంత్ర దినోత్సవానికీ ఓ దేశాధినేతను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాధినేతలను ఆహ్వానించనున్నారు. 
ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 25న స్మారకోత్సవాలను నిర్వహిస్తారు.


పరువు హత్యకేసులో ఆరుగురికి ఉరిశిక్షకూతురు తక్కువ కులస్తుడిని పెళ్లాడటంతో అల్లుడిని చంపిన కేసులో మామతో సహా ఆరుగురికి మరణశిక్ష విధిస్తూ తమిళనాడులోని తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అలమేలు నటరాజన్ డిసెంబర్ 12న తీర్పు చెప్పారు. తిరుప్పూరు జిల్లాకు చెందిన శంకర్(22) దిండుగల్లు జిల్లాకు చెందిన కౌసల్య (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కౌసల్య తండ్రి మరో ఆరుగురితో కలిసి 2016 మార్చి 13న శంకర్‌ను హతమార్చారు.


ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులుదేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. 2014 వరకు అధికారంలో ఉన్న, ప్రస్తుతం కొనసాగుతున్న మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారం కోసం కేంద్రం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి రూ.7.80 కోట్లను కేటాయించనుంది.


అత్యధిక మలేరియా కేసుల్లో భారత్‌కు మూడోస్థానం2016 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)-2017 నివేదికను నవంబర్ 29న విడుదల చేసింది. 27 శాతం కేసులతో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా, 10 శాతంతో కాంగో రెండో స్థానంలో ఉంది. 
ప్రపంచ వ్యాప్తంగా 4.45 లక్షల మలేరియా మరణాలు సంభవించగా, 33,997 మరణాలతో కాంగో మొదటి స్థానం, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. 


కోపర్డీ’ దోషులకు ఉరిశిక్ష ఖరారుమహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డీ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన కేసులో దోషులకు అహ్మద్‌నగర్ సెషన్‌‌స కోర్టు నవంబర్ 29న మరణశిక్ష విధించింది. జితేంద్ర బాబూలాల్ షిండే(25), సంతోష్ గోరఖ్ భావల్(30), నితిన్ గోపీనాథ్ భైలూమే(23)లకు మరణశిక్ష విధిస్తూ అదనపు ప్రత్యేక జడ్జి సువర్ణ కేవలే తీర్పునిచ్చారు.
మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను 2016, జూలై 13న ఈ ముగ్గురు రేప్‌చేసి చంపేశారు. దీంతో అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద న్యాయమూర్తి నవంబర్ 18న వీరిని దోషులుగా నిర్ధారించారు.


ఎన్‌సీబీసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదంజాతీయ బీసీ కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఓబీసీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభ యథాతథంగా ఆమోదించగా, రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1993లోనే ఏర్పాటుచేసిన ఎన్‌సీబీసీకి కేంద్ర జాబితాలో ఏఏ వర్గాలను చేర్చాలో, తొలగించాలో అన్న విషయమై సిఫార్సుచేసే అధికారం మాత్రమే ఉంది.


నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ : ఎన్‌సీఆర్‌బీ నివేదికహత్యలు, మహిళలపై నేరాలు వంటి వాటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. మెట్రో నగరాలపరంగా చూస్తే ఢిల్లీలో ఎక్కువగా రేప్‌లు (40%) జరిగినట్లు తెలిపింది. 2016లో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 30న విడుదల చేశారు.
నివేదిక ముఖ్యాంశాలు
  • యూపీలో 2016లో అత్యధికంగా 4889 హత్యలు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం హత్యల్లో 16.1 శాతం. బిహార్ 2581 (8.4%) హత్యలతో తరువాతి స్థానంలో ఉంది.
  • మహిళలపై నేరాలకు సంబంధించి యూపీలో 49,262 (14.5%) కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్‌లో 32,513 (9.6) కేసులు నమోదయ్యాయి.
  • దేశవ్యాప్తంగా రేప్ కేసులు 2015తో పోల్చితే 12.4 శాతం పెరిగాయి. ఈ విషయంలో మధ్యప్రదేశ్(4882), యూపీ (4816), మహారాష్ట్ర(4,189) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఐపీసీ కింద నమోదైన కేసులు యూపీలో 9.5 శాతం ఉన్నాయి. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (8.9%), మహారాష్ట్ర (8.8%), కేరళ (8.7%) ఉన్నాయి.
  • అపహరణ కేసులు దేశవ్యాప్తంగా 6 శాతం పెరగగా.. పిల్లలపై నేరాలు 13.6 శాతం పెరిగాయి.
  • షెడ్యూల్డ్ కులాలపై దాడులు 5.5%, షెడ్యూల్డ్ తెగలపై 4.7 శాతం పెరిగాయి.
  • ఎస్సీలపై దాడులు యూపీలో అత్యధికంగా 25.6% నమోదవగా, తరువాతి స్థానంలో బిహార్ (14%), రాజస్తాన్ (12.6%) ఉన్నాయి.
  • ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1823(27.8 శాతం) కేసులు నమోదయ్యాయి.
  • మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాల్లో ఢిల్లీలోనే 33 శాతం చోటుచేసుకోగా, ముంబైలో 12.3% కేసులు నమోదయ్యాయి.


‘ట్రిపుల్ తలాక్’కు మూడేళ్ల జైలుట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా ముసాయిదాను కేంద్రం రూపొందించింది. ఈ మేరకు ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది. 
ముస్లిం మహిళల హక్కుల చట్టాన్ని ‘షా బానో చట్టం-1986’గా కూడా పిలుస్తారు. షా బానో కేసు నేపథ్యంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు రక్షణ వర్తించేలా నిబంధనలుండటంతో విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేస్తున్నారు.


8 వేల మానవ అక్రమ రవాణా కేసులు నమోదుదేశవ్యాప్తంగా 2016లో 8132 మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. సగటున రోజుకు 63 మందిని పోలీసులు రక్షించినట్లు పేర్కొంది. ఈ కేసుల్లో 58 శాతం మంది బాధితులు 18 ఏళ్లలోపు వారే. వీటిల్లో 3,579 కేసుల (44 శాతం)తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, రాజస్తాన్ (1,422 కేసులు), గుజరాత్ (548), మహారాష్ట్ర (517), తమిళనాడు (434) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.




No comments:

Post a Comment