Saturday, 15 April 2017

ఏప్రిల్ 2017 జాతీయం

ఉడాన్’ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలకు ఉద్దేశించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ మేరకు పథకంలోని తొలి సర్వీసు ( షిమ్లా - ఢిల్లీ ) ను ఏప్రిల్ 27న జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు కడప- హైదరాబాద్, నాందేడ్- హైదరాబాద్ రూట్లలో కూడా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. 
ఉడాన్ పథకం కింద విమానయాన టికెట్ల ధరల గరిష్ట పరిమితి రూ. 2,500గా ఉంటుంది. మార్కెట్ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రాంతీయంగా కనెక్టివిటీని పెంచే దిశగా చేపట్టిన ఉడాన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్ట మొదటిదని ప్రధాని కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. 


ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మేరకు ఏప్రిల్ 26న వెలువడిన ఫలితాల్లో బీజేపీ 181 వార్డులను గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 48 వార్డులు, కాంగ్రెస్ 30 వార్డుల్లో గెలుపొందాయి. ఢిల్లీ కార్పోరేషన్‌లో మొత్తం 272 వార్డులు ఉండగా 270 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 


పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 136వ ర్యాంకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ 2016లో 133వ స్థానంలో ఉన్న భారత్ 2017 నివేదికలో మరో 3 ర్యాంకులు దిగజారి 136 స్థానంలో నిలచింది. ఈ మేరకు రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ అనే సంస్థWorld Press Freedom Index - 2017ను ఏప్రిల్ 26న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రష్యా, భారత్, చైనా సహా 72 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదకర స్థితిలో ఉంది. 
మొత్తం 180 దేశాలతో రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌లో నార్వే తొలి స్థానంలో ఉండగా స్వీడన్ 2, ఫిన్లాండ్ 3వ స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియా అట్టడుగున 180వ స్థానంలో నిలిచింది. 


హౌరా-కోల్‌కత్తా మధ్య తొలి నీటి సొరంగందేశంలోనే తొలి నీటి సొరంగ మార్గం కోల్‌కత్తాలోని హూగ్లీ (గంగా) నదిలో నిర్మితమవుతోంది. హౌరా - కోల్‌కత్తా నగరాలను అనుసంధానం చేసే ఈస్ట్ వెస్ట్ మెట్రో కోసం నిర్మిస్తోన్న ఈ భారీ సొరంగ మార్గం 2017 జూలై నాటికి పూర్తికానుంది. మొత్తం 10.8 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని భారీ టన్నెల్ బోరింగ్ యంత్రంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 8,900 కోట్లు. 


అబూజ్‌మడ్ తొలి రెవెన్యూ సర్వే ప్రారంభంఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన అబూజ్‌మడ్ ప్రాంతంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా రెవెన్యూ సర్వే జరుగుతోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా భూ రికార్డుల్ని రూపొందిస్తారు. దీంతో అక్కడి 237 గ్రామాల్లోని స్థానిక తెగల వారైన 35 వేలమందికి భూ పట్టాలు లభిస్తారుు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూర్కీ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా కారణాల వల్ల ఇప్పటివరకు ఇక్కడ రెవెన్యూ సర్వే చేపట్టలేదు. 


2024 నుంచి జమిలి ఎన్నికలకు నీతి ఆయోగ్ సూచన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 2024 నుంచి ఒకేసారి ఎన్నికలు జరపాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ మేరకు పరిపాలనకు ఎన్నికల ప్రచారంతో ఇబ్బంది కలగకుండా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేసారి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా(2017-2020) ముసాయిదాలో పేర్కొంది. 
ముసాయిదాలో ప్రతిపాదనలు 
  • జమిలి ఎన్నికల ప్రతిపాదన అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును గరిష్టంగా ఒకసారి తగ్గించడం కానీ, పొడిగించడం గానీ చేయాలని సూచించింది.
  • రోడ్ మ్యాప్ కోసం రాజ్యంగ నిపుణులు, మేధావులు, ప్రభుత్వాధికారులు, పార్టీల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా ఒక నివేదికను ఖరారు చేయాలి.
  • రాజ్యాంగ, చట్ట సవరణలు, జమిలి ఎన్నికలకు మారడానికి ఆచరణ సాధ్యమైన విధానం వంటి వాటిని పరిశీలించి, 2018 మార్చి నాటికి బ్లూ-ప్రింట్‌ను సిద్ధం చేయాలి.


ఆసియా పసిఫిక్ ప్రాంతాల జాబితాలో ముంబై, చెన్నై ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 పర్యాటక ప్రాంతాల జాబితాలో ముంబై, చెన్నై స్థానం దక్కించుకున్నాయి. చెన్నై (52 లక్షల మంది పర్యాటకుల రాకతో) 14వ స్థానాన్ని, ముంబై(49 లక్షల మంది పర్యాటకులతో) 15వ స్థానంలో నిలిచాయి. ఏప్రిల్ 26న విడుదల చేసిన మాస్టర్‌కార్‌‌డ ఆసియా పసిఫిక్ పర్యాటక ప్రాంతాలు-2017 జాబితా ప్రకారం 2016లో దాదాపు 34 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 22 దేశాల్లో గల 171 పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. వీరిలో ఎక్కువ మందికి బ్యాంకాక్ గమ్యస్థానంగా మారింది. రెండు, మూడు స్థానాల్లో సింగపూర్, టోక్యో నిలిచాయి.

ఆవులకూ ఆధార్ తరహా గుర్తింపు సంఖ్యదేశంలోని అన్ని ఆవులకు, వాటి సంతతికి ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు (యూఐడీ) సంఖ్య కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఏప్రిల్ 24న తెలిపింది. బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా జరుగుతున్న పశువుల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు వాటికి యూఐడీ ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ.. ట్యాంపర్ చేయడానికి వీల్లేని పాలీయురేథేన్ (ప్లాస్టిక్) ట్యాగులను పశువులకు జోడించాలని సూచించింది.

బాబ్రి కేసులో విచారణ కొనసాగించాలి: సుప్రీంకోర్టుబాబ్రి మసీదు కూల్చివేత కేసులో బీజీపే అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా మరో 16 మందిపై విచారణ కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏప్రిల్ 19న తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లక్నోలోని ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని అప్పటి వరకూ న్యాయమూర్తిని బదిలీ చేయరాదని తీర్పులో పేర్కొంది. 
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కల్యాణ్‌సింగ్ ప్రస్తుతం రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్నందున విచారణ నుంచి ప్రస్తుతం ఆయనకు మినహాయింపు లభించింది. పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయనపైనా విచారణ జరగనుంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం తెలిసిందే. బీజేపీ నేతల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అడ్వాణీతో పాటు 21 మందిపై కుట్ర అభియోగాలను అలహాబాద్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 


వీవీఐపీల కార్లపై ఎర్రబుగ్గల తొలగింపు వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఏప్రిల్ 19న కేంద్ర కేబినెట్ నిశ్చయించింది. అంబులెన్‌‌సలు, అగ్నిమాపక వాహనాలతోపాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. 
ఇప్పటికే వీఐపీ వాహనాలకు బుగ్గలు, సైరన్లు లేని విధానాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.


స్టెంట్లను అత్యవసర క్లాజులో చేర్చిన కేంద్రంహృద్రోగులకు అమర్చే స్టెంట్లను నిరంతరం సరఫరా చేయాలని తయారీదారులను ఆదేశించిన కేంద్రం, వాటిని అత్యవసర క్లాజు కింద చేరుస్తూ ఏప్రిల్ 25న నిర్ణయం తీసుకుంది. ఇటీవల మెడ్‌ట్రానిక్, అబాట్ లాంటి బహుళజాతి సంస్థలు తమ స్టెంట్లను భారత్ నుంచి ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరడంతో ఫార్మాసూటికల్ విభాగం (డీఓపీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులు-2013 ప్రకారం ప్రజా ప్రయోజనాల నిమిత్తం స్టెంట్లను అత్యవసర క్లాజులో చేర్చింది. ఈ నిబంధనలు ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నాయి. 


ప్రముఖుల పేర్లపై సెలవులను రద్దు చేసిన యూపీ ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రకటిస్తున్న 15 ప్రభుత్వ సెలవులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖుల జయంతి, వర్ధంతి రోజున పాఠశాలలకు సెలవులు ఇవ్వడానికి బదులు వారి గురించి రెండు గంటల పాటు విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం వివరించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ రోజుల్లో సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది. 


అంధత్వ నిర్ధారణ ప్రమాణాల్లో మార్పు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా భారత్ అంధత్వ నిర్ధారణ నిర్వచనాన్ని మార్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 19న ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 3 మీటర్ల దూరం నుంచి చేతి వేళ్లను సరిగా లెక్కించలేని వారికి అంధత్వం ఉన్నట్లు భావిస్తారు. ఇప్పటి వరకు (1976 నుంచి) ఈ దూరం 6 మీటర్లుగా ఉండేది.

గోవా రాష్ట్ర వృక్షంగా కొబ్బరి చెట్టుగోవా రాష్ట్ర వృక్షంగా కొబ్బరి చెట్టును ప్రకటించనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ ఏప్రిల్ 22న వెల్లడించారు. గత ప్రభుత్వం కొబ్బరి చెట్టును వృక్షాల జాబితా నుంచి తొలగించింది. ఆ నిర్ణయాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు.

జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన జీఎస్టీ అనుబంధ బిల్లులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు సీజీఎస్టీ, ఐజీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులకు ఏప్రిల్ 13న ఆయన ఆమోదం తెలిపారు. కొత్త పన్నుల విధానం అమలులోకి రావాలంటే ఈ బిల్లులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీలు ఆమోదం తెలపాలి. 


ఆపరేషన్ క్లీన్ మనీ రెండో దశ ప్రారంభం నల్లధన అక్రమార్కులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ఏప్రిల్ 14న ప్రారంభించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో 1,300 మంది అత్యంత అనుమానిత వ్యక్తులతో సహా 60 వేల మందికి పైగా వ్యక్తులు, సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వారందరికీ నోటీసులు పంపనుంది. 
2017 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో ఐదు లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన 17 లక్షలకు పైగా అనుమానిత ఖాతాదారులకు ఐటీ శాఖ ఎస్సెమ్మెస్ - ఈ మెయిల్స్ పంపించింది.


భీమ్-ఆధార్ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ‘భీమ్-ఆధార్’ యాప్‌ను ఏప్రిల్ 14న నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. ఆధార్ కార్డులోని వేలిముద్రల సాయంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడానికీ, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికీ ఈ యాప్ ఉపకరిస్తుంది.
భీమ్ యాప్‌కు అనుసంధానంగా మరో రెండు పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. ఇందులో ఒకటి క్యాష్ బ్యాక్ పథకం కాగా మరొకటి రిఫరల్ బోనస్ (ఇతరులకు యాప్‌ను సూచిస్తే రూ. 10 నగదు ప్రోత్సాహం) పథకం. ఈ రెండింటి కింద రూ.495 కోట్లను ప్రోత్సాహకంగా ఇస్తారు.


లక్కీ గ్రాహక్‌లో రూ. కోటి గెలుచుకున్న శ్రద్ధా మోహన్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ పథకం మెగా డ్రాలో మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా మోహన్ మంగ్షెటే కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 14న నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆమె ఈ బహుమతి అందుకున్నారు. ఈ పథకంలో రెండో బహుమతిని (రూ.50 లక్షలను) గుజరాత్ ఖంభట్‌కు చెందిన హార్దిక్ కుమారు గెలుచుకున్నారు.


నేపాల్, చైనా తొలి ఉమ్మడి సైనిక విన్యాసాలు నేపాల్, చైనా దేశాల తొలి ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏప్రిల్ 16న ఖాట్మాండులో ప్రారంభమయ్యాయి. సగర్‌మఠ ఫ్రెండ్‌షిప్ 2017 పేరుతో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం ఏప్రిల్ 25 వరకూ కొనసాగనుంది. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు రెండు దేశాలు ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. 
ఎవరెస్టు శిఖరాన్ని నేపాలీ భాషలో సగర్‌మఠ్ అని పిలుస్తారు. 


ఆగ్రా విమానాశ్రయానికి దీన్‌దయాళ్ పేరుఆగ్రా విమానాశ్రయానికి ఆరెస్సెస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గోరఖ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో నిర్మిస్తున్న సివిల్ టెర్మినల్‌కు మహాయోగి గోరఖ్‌నాథ్ పేరు పెట్టనున్నారు. ఏప్రిల్ 18న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 


ప్రధానితో అమెరికా జాతీయ సలహాదారు భేటీఅమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ ఏప్రిల్ 18న ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడం, ప్రాంతీయ శాంతి భద్రతల్లో స్థిరత్వం నెలకొల్పడం వంటి అంశాలపై ఇరువురు చర్చించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక భారత్ పర్యటనకు వచ్చిన యూఎస్ తొలి ఉన్నతస్థాయి అధికారి మెక్‌మాస్టర్. ఒబామా ప్రభుత్వం గత డిసెంబర్‌లో భారత్‌కు ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను కల్పించింది.


‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంతో అపార నష్టం’యమునా తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం కారణంగా అపార నష్టం జరిగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిపుణుల కమిటీ ఏప్రిల్ 12న వెల్లడించింది. ఉత్సవం కారణంగా నదీ తీరప్రాంతం ధ్వంసమవడంతోపాటు నదికి ఎడమ వైపు దాదాపు 300 ఎకరాలు, కుడి వైపు 120 ఎకరాలు.. మొత్తం 420 ఎకరాల ముంపు ప్రాంతంపై పర్యావరణ పరంగా తీవ్ర ప్రభావం పడిందని కమిటీ పేర్కొంది.

రైల్వే డెవలప్‌మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదం రైల్వే డెవలప్‌మెంట్ అథారిటికీ కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 5న ఆమోదం తెలిపింది. ఇది రైల్వే రంగంలో అతిపెద్ద సంస్కరణని ప్రభుత్వం పేర్కొంది. రైల్వే వ్యవస్థలోని లోటుపాట్లను పరిష్కరించటం, టికెట్ రేట్లను నిర్ణయించటం, ప్రయాణికుల సౌకర్యం, ల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులు, పారదర్శకత పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది.


జీఎస్టీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం వస్తు, సేవల పన్ను బిల్లు - జీఎస్టీకి సంబంధించిన నాలుగు అనుబంధ బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ మేరకు కేంద్ర జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ) 2017, సమీకృత జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ) 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ బిల్లు(యూటీజీఎస్టీ) 2017ను ఏప్రిల్ 6న రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్జీఎస్టీ) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. 


భారత్‌లో 25 శాతం మంది పిల్లల్లో కుంగుబాటు భారత్‌లోని 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ప్రతి నలుగురిలో ఒకరు (25 శాతం మంది) కుంగుబాటుకు లోనవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2012లో భారత్‌లో 15-29 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి లక్ష మందిలో ఆత్మహత్యల రేటు 35.5గా ఉంది. 
2017 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ : DEPRESSION : LETS TALK


దేశవ్యాప్తంగా వినియోగంలోకి బీఎస్-4 ఇంధనం దేశవ్యాప్తంగా బీఎస్-4 ఇంధన వినియోగం 2017 ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. బీఎస్-3 తో పోలిస్తే బీఎస్-4 ఇంధనలో సల్ఫర్ శాతం తక్కువగా ఉంటుంది. ఇంధనంలో ఈ మార్పులతో వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల శాత ం తగ్గుతుంది. 
భారత్‌లో 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను సుప్రీంకోర్టు ఇటీవలే నిషేధించింది. 


250 ఏళ్లు పూర్తి చేసుకున్న సర్వే జనరల్ ఆఫ్ ఇండియాదేశంలో పౌర, సైనిక అవసరాలకు మ్యాపుల్ని రూపొందించే సర్వే జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఐ) ఏప్రిల్ 10న 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశ, రాష్ట్రాల సరిహద్దులు, నదులు, డ్యాములు, రోడ్లు, వరద ప్రభావిత మైదాన ప్రాంతాలు, వివిధ స్థలాకృతులతో పాటు పట్టణ, నగర ప్రణాళిక మ్యాపుల్ని రూపొందించడం ఎస్‌జీఐ విధి. దీనిని 1767లో స్థాపించారు. 
ఎస్‌జీఐ విశేషాలు 
  • 1783లో ఎస్‌జీఐ తొలిసారి అవిభక్త భారత పటాన్ని ‘మ్యాప్ ఆఫ్ హిందుస్తాన్’ గా విడుదల చేసింది.
  • 1802లో ఎస్‌జీఐ ‘ట్రిగొనమెట్రిక్ సర్వే’ను జరిపింది. మద్రాసు రాష్ట్రంలోని సెయింట్ థామస్ పర్వతం నుంచి ముస్సోరీ వరకూ 40 ఏళ్ల పాటు ఈ సర్వే సాగింది.
  • ప్రస్తుతం ఎస్‌జీఐ సైన్యం కోసం జియో స్పేషియల్ (భౌగోళిక) మ్యాపుల్ని తయారుచేస్తోంది.


న్యూఢిల్లీలో జాతీయ పర్యావరణ సదస్సుక్యాపిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఏప్రిల్ 10న జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన నలుగురు పర్యావరణ వేత్తలకు క్యాపిటల్ ఫౌండేషన్ పర్యావరణ అవార్డులు ప్రదానం చేశారు. 
అవార్డు గ్రహీతలు 
జస్టిస్ కుల్దీప్ సింగ్ జాతీయ అవార్డు - జస్టిస్ స్వతంత్రకుమార్, ఎన్జీటీ ఛైర్మన్ 
ప్రొఫెసర్ టి.శివాజీ రావ్ జాతీయ అవార్డు - ప్రొఫెసర్ ధర్మేంద్ర సింగ్
వార్షిక అవార్డులు - దిలీప్ రే( మే ఫెయిర్ గ్రూప్ హోటల్స్ సీఎండీ), రాకేష్ మల్హోత్రా (సింబోటిక్ సైన్‌‌స సంస్థ చైర్మన్ ) 


మోటార్ వాహనాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం మోటార్ వాహనాల బిల్లు (సవరణ)-2016కు లోక్‌సభ ఏప్రిల్ 10న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు తెస్తూ కేంద్రం ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టింది.
మద్యం సేవించి వాహనాలు నడపటం, ఓవర్ లోడింగ్, అతి వేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో రహదారి ప్రమాదాల ద్వారా సంభవించే మరణాలను 50 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 


జాతీయ ఓబీసీ కమిషన్ బిల్లుకి లోక్‌సభ ఆమోదం రాజ్యాంగ హోదాతో కొత్త జాతీయ ఓబీసీ కమిషన్ (ఎన్‌సీఎస్‌ఈబీసీ) ఏర్పాటుకు ఉద్దేశించిన 102వ రాజ్యాంగ సవరణ బిల్లు - 2017కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 10న కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకి అనుకూలంగా 360 మంది సభ్యులు ఓటు వేశారు.
మొత్తం ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయనున్న ఎన్‌సీఎస్‌ఈబీసీలో ఒక మహిళకూ చోటు కల్పించనున్నారు. 


న్యూఢిల్లీలో స్వచ్ఛాగ్రహ ప్రదర్శన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాగ్రహ (Swachhagraha-Bapu Ko Karyanjali) ప్రదర్శనను ఏప్రిల్ 10న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. చంపారణ్ నుంచి మహాత్మా గాంధీ సత్యాగ్రహం ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 
స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు.

కేరళలో తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం కేరళలో మాతృభాష మలయాళాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న ఆర్డినెన్‌‌స తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అనుబంధమున్న స్కూళ్లు, సెల్ఫ్ ఫైనాన్‌‌స ఇన్‌స్టిట్యూషన్‌‌స) పదో తరగతి వరకు మలయాళంను తప్పనిసరిగా బోధించాలి. 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. 


విశాఖ ఐఐపీఈకి కేంద్ర కేబినెట్ ఆమోదంప్రత్యేక చట్టం ద్వారా విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ (ఐఐపీఈ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ వర్సిటీ స్థాపనకు అవసరమైన రూ.655.46 కోట్ల మేర మూలధన వ్యయానికి అంగీకారం తెలిపింది. అలాగే ఎండోమెంట్ ఫండ్ కింద వర్సిటీకి రూ.200 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం లభించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వర్సిటీని ఏర్పాటు చేయనుంది. ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సబ్బవరం మండలంలో 200 ఎకరాలు కేటాయించింది.


ఎఫ్‌డీడీఐకి జాతీయ సంస్థ హోదాఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)కు జాతీయ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఏప్రిల్ 5న ఆమోదం తెలిపింది. 

ఇద్దరు పిల్లలకు మించితే ప్రభుత్వఉద్యోగానికి అనర్హులుఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని అసోం ప్రభుత్వం ఏప్రిల్ 9న ప్రకటించింది. అలాగే చట్టపరంగా పెళ్లి వయసు రాకుండానే వివాహం చేసుకునేవారికీ ఇదే నిబంధన తీసుకొస్తున్నట్లు పేర్కొంది. 

పర్యాటక పోటీతత్వంలో భారత్‌కు 40వ ర్యాంక్ప్రపంచ పర్యాటక పోటీతత్వంలో భారత్ ఒక్కసారిగా 12 స్థానాలను మెరుగుపరచుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) నివేదిక ప్రకారం 2015లో 52వ ర్యాంక్ పొందిన భారత్.. 2016లో 40వ ర్యాంక్ సాధించింది.

దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని చెనాని-నష్రీ ప్రధాన రహదారిలో నిర్మించిన దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారిని ఏప్రిల్ 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మార్గం కశ్మీర్ లోయను జమ్మూతో కలుపుతుంది.
సొరంగ మార్గం విశేషాలు 
  • 9.2 కిలోమీటర్ల చెనాని-నాష్రి సొరంగ మార్గం దేశంలోనే అత్యంత పొడవైనది. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3,720 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగమార్గం నార్వేలో (24.51 కిలోమీటర్లు) ఉంది.
  • ఈ మార్గం వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 31 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణ సమయం 2 గంటలు తగ్గుతుంది.
  • ఈ మర్గం వల్ల ప్రతి రోజూ రూ. 27 లక్షల విలువైన ఇంధనం ఆదా అవుతుంది.
  • వాహనాదారుల భద్రత నిమిత్తం మార్గం మొత్తం మీద 124 సీసీటీవీ కెమెరాలను, అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులకు రోడ్డు మార్గం చక్కగా కనపడేలా విద్యుత్ దీపాలను అమర్చారు.
  • ఇది ఆసియాలోనే అతి పొడవైన రెండు మార్గాల సొరంగం.
  • ప్రయాణికులకు తాజా గాలిని అందించే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సొరంగ మార్గాల్లో ప్రపంచంలో ఇది ఆరోది కాగా భారత్‌లో మొదటిది.
  • శ్రీనగర్‌లో ప్రారంభమై కన్యాకుమారి దాకా సాగే జాతీయ రహదారి 44పై ఈ టన్నెల్ ఉంది. మొత్తం 3,745 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లు సహా 11 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. భారత్‌లో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే.


ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాలపై నిషేధం భారత్ స్టేజ్ (బీఎస్)- 4 కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను సుప్రీం కోర్టు నిషేధించింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి వీటిని నిషేధిస్తూ మార్చి 29న తీర్పు వెలువరించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచే దేశవ్యాప్తంగా బీఎస్-4 ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. 
దేశంలోని వాహన తయారీదారులు, డీలర్ల వద్ద ప్రస్తుతం బీఎస్-3 ప్రమాణాలున్న వాహనాలు 7 లక్షల వరకూ ఉంటాయన్నది అంచనా. బీఎస్-3 ఇంజన్లు కలిగిన వాహనాలు బీఎస్-4 వాహనాలతో పోల్చితే 80 శాతం అధికంగా కాలుష్య కారకాలను గాలిలోకి విడుదల చేస్తాయి.


భారత్, మలేసియాల మధ్య 7 ఒప్పందాలుమలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మలేసియాను సందర్శించే భారత పర్యాటకులను ప్రోత్సహించేలా వీసా రుసుము రద్దు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో అనుమతి, రెండు దేశాల్లోని కోర్సులకు పరస్పరం గుర్తింపు వంటి అంశాలు ఉన్నాయి.

దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ - 2017 కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) దేశంలోని ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది. ఓవరాల్ వర్సిటీస్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, కాలేజీల విభాగాల్లో ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ఓవరాల్ విభాగంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో బెంగళూరులోని 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ప్రథమ స్థానంలో నిలిచింది. 
ఓవరాల్ కేటగిరిలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) దేశంలో 14వ స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో హైదరాబాద్ ఐఐటీ 26, ఉస్మానియా యూనివర్సిటీ 38, ఎస్వీయూ 68, ఏయూ 69 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఫార్మసీ విభాగంలో ఏయూ 18వ స్థానంలో నిలిచింది. 
టాప్ 10 విద్యా సంస్థలు 
సంస్థ
పట్టణం
ర్యాంకు
ఐఐఎస్‌సీ
బెంగళూరు
1
జేఎన్‌యూ
ఢిల్లీ
2
బీహెచ్‌యూ
వారణాసి
3
జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్
బెంగళూరు
4
జాదవ్‌పూర్ వర్సిటీ
కోల్‌కత్తా
5
అన్నా యూనివర్సిటీ
చెన్నై
6
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్
7
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
ఢిల్లీ
8
అమృత విశ్వ విద్యాపీఠం
కోయంబత్తూర్
9
సావిత్రిబాయి పూలే వర్సిటీ
పూణె
10

న్యూఢిల్లీలో ఎస్‌ఏఎస్‌ఈసీ సదస్సు దక్షిణాసియా ఉప-ప్రాంతీయ ఆర్థిక సహకార సంస్థ ( South Asia Subregional Economic Cooperation - SASEC ) సదస్సు న్యూఢిల్లీలో ఏప్రిల్ 3న జరిగింది. 2025 నాటికి ఎస్‌ఏఎస్‌ఈసీ దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటక విలువను 70 బిలియన్ డాలర్లకు పెంచాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఏడు సభ్య దేశాల (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, మైన్మార్ ) ఆర్థిక మంత్రులు నిర్ణయించారు. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్ 2001లో ఎస్‌ఏఎస్‌ఈసీని ఏర్పాటు చేశాయి. మిగతా మూడు దేశాలు ఆ తర్వాత ఇందులో చేరాయి. 


హైవేలపై మద్యం నిషేధంజాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని సుప్రీంకోర్టు మార్చి 31న ఆదేశించింది. 2016, డిసెంబర్ 15కు ముందు లెసైన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలు రాష్ట్రాలు) వారికి మాత్రం కొంత గడువు ఇచ్చింది.

నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి అస్సాం ప్రజలు ఏటా ఘనంగా జరుపుకునే నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 31న ప్రారంభించారు. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రవహించే 21 జిల్లాల్లో ఈ వేడుకలను ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. మన దేశంలో జరిపే నదీ ఉత్సవాల్లో నమామి బ్రహ్మపుత్ర వేడుకలే అతి పెద్దవి. 


రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన యూపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో రూ.36,359 కోట్ల మేర రైతు రుణమాఫీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో 2.15 కోట్ల మంది చిన్న, మధ్య తరహా రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ‘కిసాన్ రాహత్ బాండ్ల’ను జారీ చేయనున్నారు. 


150 ఏళ్ల పూర్తిచేసుకున్న అలహాబాద్ హైకోర్టుదేశంలో పురాతనమైన హైకోర్టుగా గుర్తింపు పొందిన అలహాబాద్ హైకోర్టు 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 2017 మార్చి 14 నుంచి ఏప్రిల్ 2 వరకూ 150 ఏళ్ల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 
ఇండియన్ హైకోర్ట్స్ చట్టం 1861 ప్రకారం 1866లో ఈ కోర్టు ఏర్పడింది. మొదట్లో హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ ఫర్ ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్‌గా వ్యవహరించే ఈ కోర్టు పేరుని 1919లో అలహాబాద్ హైకోర్టుగా మార్చారు. దేశంలో కోల్‌కత్తా, మద్రాస్, బాంబే తర్వాత పురాతమైన హైకోర్టు ఇదే. 

టెక్స్‌టైల్ పాలసీ - 2017 దేశీయ వస్త్రోత్పత్తి రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన టెక్స్‌టైల్ పాలసీని ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 8 పవర్‌లూమ్ క్లస్టర్లలో పవర్‌టెక్స్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరమగ్గాలు ఉన్న సిరిసిల్లకు ఈ పథకంలో స్థానం దక్కింది. ఈ పథకం ప్రకారం పవర్‌లూమ్స్‌లో మగ్గాల ఆధునికీకరణకు కేంద్రం మరింత సాయం అందిస్తుంది. నూలు డిపో ఏర్పాటుకు ముద్ర బ్యాంకు ద్వారా రూ.2 కోట్ల రుణం ఇస్తుంది. 


నోయిడాలో స్మార్ట్ ఇండియా హ్యాకథన్ - 2017ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఏప్రిల్ 1, 2వ తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథన్ - 2017 కార్యక్రమం జరిగింది. నాస్కాం, మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10 వేల మంది పాల్గొన్నారు. ఏఐసీటీఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 
యువతలోని ప్రతిభను వెలికితీసి, వారు రూపొందించిన ఆవిష్కరణల్ని సామాజిక సమస్యల పరిష్కారానికి వినియోగిండమే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లక్ష్యం. 
 

ఎస్‌హెచ్‌జీల ద్వారా రైళ్లలో ఈ-కేటరింగ్ స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రైళ్లలో ప్రాంతీయ రుచులు అందించేలా స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్ సదుపాయాన్ని రైల్వే శాఖ ప్రారంభించనుంది. ఈ మేరకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ 9 ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు మైసూర్, ఎర్నాకులం, అద్రా (పశ్చిమ బెంగాల్) తదితర పది స్టేషన్లలో ఈ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. 

Wednesday, 22 March 2017

మార్చి 2017 జాతీయం

నీటి ఎద్దడిపై నీతిఆయోగ్ ఆందోళన :: దేశంలో పెరిగిపోతున్న నీటిఎద్దడిపై నీతిఆయోగ్ మార్చి 23న ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉపయోగిస్తున్న నీటిలో వ్యవసాయ అవసరాలకే 70 శాతం సరిపోతోందని, జలాల వినియోగ సమర్థతను మరో 20 శాతం పెంచేలా పరిశోధనలు చేయాలని పేర్కొంది.

గోవధకు మరణశిక్ష విధించాలని ప్రైవేటు బిల్లు ::గోవధకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాజ్యసభలో మార్చి 24న ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. గోవుల సంఖ్యను స్థిరీకరించేలా ప్రాధికార సంస్థ ఏర్పాటు, రాజ్యాంగంలోని 37, 48 అధికరణలకు అనుగుణంగా చర్యలు, గోవధ నిషేధం ఉండాలని బిల్లులో పొందుపరిచారు. 

ఓబీసీలకు రాజ్యాంగబద్ధ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం  :: ఎస్టీ, ఎస్టీలకు ఉన్నట్లుగానే జాతీయ స్థాయిలో ఓబీసీ(ఇతర వెనకబడిన వర్గాలు) లకు రాజ్యాంగబద్ధ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి 23న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతమున్న బీసీ జాతీయ కమిషన్‌ను రద్దు చేసే ప్రతిపాదననూ ఆమోదించింది. 
1993 ఆగస్టు 14న సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధ వ్యవస్థగా బీసీ జాతీయ కమిషన్ ఏర్పడింది. అయితే దీనికి ఓబీసీల ఫిర్యాదులను పరిష్కరించే అధికారం లేదు. అందుకోసం ఇప్పుడు కొత్తగా ‘సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్’ (ఎన్‌సీఎస్‌ఈబీసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక ఉప చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. 


మానవుల అక్రమ రవాణాలో బెంగాల్ టాప్ :: దేశవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్చి 26న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి 2016లో బెంగాల్‌లో 3,576, రాజస్తాన్‌లో 1,422 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 61 శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. 548 కేసులతో గుజరాత్ మూడోస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 239, తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయి. 
అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్.. బంగ్లాదేశ్, యూఏఈలతో అవగాహనా ఒప్పందాల్ని కుదుర్చుకుంది. 


యూపీలో యాంటీ-రోమియో దళాలు ప్రారంభం  :: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఆ రాష్ట్ర పోలీసులు మార్చి 22న యాంటీ- రోమియో పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈవ్‌టీజింగ్‌ని అరికట్టేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు. అలాగే గోవధపై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని తన వ్యక్తిగత వెబ్‌సైట్ www.yogiadityanath.in ద్వారా తెలపాలని సీఎం ఆదిత్యనాథ్ కోరారు. 


దక్షిణాది జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు :: దక్షిణాది రాష్ట్రాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని కేంద్ర జలవనరుల శాఖ మార్చి 25న ప్రకటించింది. దక్షిణాదిలోని 31 రిజర్వాయర్లలో మార్చి 24 నాటికి కేవలం 16 శాతం మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొంది. ఇది గతేడాది కంటే 2 శాతం, గత పదేళ్ల సగటు కంటే 13 శాతం తక్కువ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో ఉన్న ఈ 31 రిజర్వాయర్ల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 51.59 శతకోటి ఘనపు మీటర్లు (బీసీఎం). ప్రస్తుతం 8 బీసీఎం మాత్రమే నిల్వలున్నాయి. 

శశికళ, పన్నీర్ సెల్వం కొత్త పార్టీలు  :: అన్నాడీఎంకేకు ఉన్న రెండాకుల ఎన్నికల చిహ్నం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల్లో ఎవరికీ చెందదని మార్చి 22న ఎన్నికల సంఘం తేల్చింది. దీంతో ఇరు వర్గాలు కొత్త పార్టీలు పెడుతున్నట్లు ప్రకటించాయి. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ పేరుతో పార్టీని ప్రకటించిన పన్నీర్ సెల్వం ఎన్నికల చిహ్నంగా రెండు లైట్ల విద్యుత్ స్తంభాన్ని ఎంచుకున్నారు. అన్నాడీఎంకే అమ్మ పేరుతో పార్టీని స్థాపించిన శశికళ వర్గం ఎన్నికల గుర్తుగా టోపీని ఎంచుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో రెండు పార్టీలు కేటాయించిన గుర్తులతో పోటీ చేయనున్నాయి. 


భారత్‌లోని ఐదు నగరాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు  :: భారత్‌లోని ఐదు నగరాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ మేరకు మార్చి 22న రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్రం అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్, ముంబై నగరాలకు యునెస్కో వారసత్వ హోదా లభించిందని పేర్కొంది. 

5 ఏళ్లలో వెయ్యి మె.వా. సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయనున్న రైల్వే :: భారతీయ రైల్వే వచ్చే 5 ఏళ్లలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మార్చి 25న వెల్లడించారు. 
మొత్తంగా రైల్వేల నిర్వహణ కోసం ప్రస్తుతం వెచ్చిస్తున్న ఇంధన వ్యయంలో పదేళ్లలో రూ.41 వేల కోట్లు ఆదా చేయాలన్నది లక్ష్యం. 


అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ :: 2015-16 గణాంకాల ప్రకారం భారత్‌లో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే మార్చి 27న రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) విలువల ప్రకారం.. ఢిల్లీ, ఫరీదాబాద్, వారణాసి, లక్నో, జైపూర్, కాన్పూర్, పట్నా, ముజఫర్‌నగర్ నగరాల్లో గాలి తీవ్రంగా కలుషితమైంది. 
ఆగ్రా, జోధ్‌పూర్, గుర్గావ్, గయా, సోలాపూర్, చంద్రాపూర్, చెన్నైలలో ఓ మోస్తరుగా కలుషితమైంది. 
హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, నవీ ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌లాంటి నగరాల్లో వాయు నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉంది. 


సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీంకోర్టు :: సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆయా పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ కార్డును తప్పనిసరి చేయలేవని చెప్పింది. ఈ మేరకు ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని మార్చి 27న కోర్టు అభిప్రాయపడింది. 
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, ఐటీ రిటర్న్ దాఖలు వంటి సంక్షేమేతర అంశాలకు ఆధార్‌ను అడ్డుకోమని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ తప్పనిసరి కాదని 2015 ఆగస్టు 11న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 


మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం :: మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లు - 2016కు లోక్‌సభ మార్చి 27న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించడం నేరం కాదు. మానసిక వికలాంగులు మెరుగైన వైద్యం పొందే హక్కు, వారి ఆస్తిని కాపాడుకునే హక్కులను కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.


జాతీయ వైద్య విధానం - 2017 :: జాతీయ వైద్య విధానం-2017ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 16న కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో ఈ విధానాన్ని ఆవిష్కరించారు. దేశంలో వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేయాలనే లక్ష్యంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసింది. ఇందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించటంతోపాటు అన్ని మందులను అందుబాటులో ఉంచటం ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి. ఆయుర్దాయాన్ని 67.5 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, పాఠశాలలు, పని కేంద్రాల్లో మరింత విసృ్తతంగా యోగాను ప్రారంభించాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ప్రజారోగ్యంపై వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.5 శాతం ఉండగా దీన్ని ఒక నిర్దిష్ట కాలక్రమంలో 2.5 శాతానికి పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 

పాలసీలోని ముఖ్యాంశాలు :: 
  • పేషెంట్లకు సాధికారత కల్పించేలా చికిత్స సరిగా అందని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు ట్రిబ్యునళ్ల ఏర్పాటు.
  • 2025 కల్లా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటును 23కి, ప్రసూతి మరణాల రేటును 2020 కల్లా 100కు తగ్గించాలి.
  • 2019 కల్లా శిశు (ఏడాదిలోపు చిన్నారులు) మరణాల రేటును 28కి, 2025 కల్లా నియోనటల్ (పుట్టిన నెలరోజులోపు చిన్నారులు) మరణాల రేటును 16కు, గర్భస్థ శిశువు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు మార్చాలని లక్ష్యం.
  • సంతాన సాఫల్య రేటును 2025కల్లా ప్రస్తుతమున్న 2.5 నుంచి 2.1కు తగ్గించాలి.
  • 2018 కల్లా కుష్టు వ్యాధి నిర్మూలన.


గోవా శాసనసభలో బలపరీక్ష నెగ్గిన పరీకర్  :: గోవాలో మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మార్చి 16న జరిగిన బల నిరూపణలో నెగ్గింది. ఈ మేరకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బలం నిరూపించు కుంది. బీజేపీ నుంచి 12 మంది, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ఎంజీపీల నుంచి ముగ్గురు చొప్పున, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఎన్సీపీ సభ్యుడు కలిపి మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. 


టైమ్స్ ఆసియాలో ఐఐఎస్సీకి 27వ ర్యాంకు  :: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో 2017లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్సీ ) 27వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు మార్చి 16న టీహెచ్‌ఈ వెల్లడించిన జాబితాలో ఐఐఎస్సీతో పాటు ఐఐటీ-బాంబే (42వ ర్యాంకు), తమిళనాడులోని వేల్-టెక్ యూనివర్సిటీ (43), ఐఐటీ-ఢిల్లీ (54), ఐఐటీ-మద్రాసు (62) ర్యాంకుల్లో నిలిచాయి. మొత్తంగా ఆసియాలోని టాప్-300 యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి 33 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. ఇందులో ఉస్మానియా, ఎస్వీయూ, ఆచార్య నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 
టీహెచ్‌ఈ ఆసియా ర్యాంకింగ్స్‌లో సింగపూర్ జాతీయ వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 


క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ లో మణిపాల్‌కు చోటు :: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017లో మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ చోటు దక్కించుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ మార్చి 16న వివరాలను వెల్లడించారు. 2016లో ఫార్మకాలజీ విభాగంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో ఈ కళాశాల ప్రథమ స్థానం పొందింది. 


రాజీతోనే ఆయోధ్య వివాదం పరిష్కారం : సుప్రీం కోర్టు  :: అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ మేరకు కేసును తర్వగా విచారించాలంటూ పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం మార్చి 21న ఈ సూచన చేసింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. 
వివాదాస్పద స్థలానికి సంబంధించిన 2.77 ఎకరాల్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.


ఉచిత గ్యాస్‌కు ఆధార్ తప్పనిసరి  :: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే నిరుపేద మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 8న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆధార్ లేనివారు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే 2017 ఖరీఫ్ సీజన్ నుంచి పంటల బీమా పొందే రైతులకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. 
మూడేళ్లలో ఐదు కోట్ల మంది నిరుపేద మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు.


ఓన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ జాతికి అంకితం :: గుజరాత్‌లోని ద హేజ్ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్)లో ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపాల్)ను ప్రధాని నరేంద్రమోదీ మార్చి 7న జాతికి అంకితం చేశారు. రూ.30,000 కోట్లతో నిర్మించిన ఈ ప్లాంటు దేశంలోనే అతిపెద్ద పెట్రో రసాయనాల ప్లాంటు అని ప్రధాని తెలిపారు. 2018 నాటికి దేశ పాలిమర్ రంగంలో ఓపాల్ వాటా 13 శాతానికి చేరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రసూతి సెలవుల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం :: ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు-2016కు లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ మేరకు మార్చి 9న కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. దీని ప్రకారం సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెరుగుతాయి. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే తొలి రెండు కాన్పులకే 26 వారాల ప్రసూతి సెలవులు వర్తిస్తాయి. మూడో కాన్పుకు 12 వారాలే ఇస్తారు. 
ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. తద్వారా మహిళలకు అత్యధిక ప్రసూతి సెలవులు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కెనడా (50 వారాలు), నార్వే (44 వారాల)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 
బిల్లులోని ఇతర అంశాలు  :: 
  • చట్ట ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకునే, అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు.
  • కనీసం 50 మంది పనిచేస్తున్న సంస్థలు నిర్ధారిత దూరంలో పిల్లల సంరక్షణ కేంద్రాన్ని (క్రెచ్) ఏర్పాటు చేయాలి. తల్లి రోజులో 4 సార్లు అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలి.


అవినీతి పెండింగ్ కేసులు రైల్వేలోనే అధికం :: ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉందని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తెలిపింది. మార్చి 10న వెల్లడైన ఈ వివరాల ప్రకారం రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై 193 కేసులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు - 2017 :: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మార్చి 12న వెలువడ్డాయి. యూపీలో 403 స్థానాలకు గాను బీజేపీ 312 స్థానాల్లో గెలుపొందింది. మిత్రపక్షాలైన అప్నాదళ్, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) సీట్లతో కలుపుకుంటే ఆ సంఖ్య 325. ఎస్పీ-కాంగ్రెస్ 54, బీఎస్పీ 19 స్థానాలకే పరిమితమయ్యాయి. 1977లో జనతాపార్టీ యూపీలో అత్యధికంగా 352 సీట్లను గెల్చుకుంది. 
పంజాబ్‌లో కాంగ్రెస్ 77 స్థానాలు సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోగా ఉత్తరాఖండ్‌లో బీజేపీ (56 సీట్లు) ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. గోవా, మణిపూర్‌లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. 
మణిపూర్‌లో సీఎం ఇబోబిసింగ్‌పై పోటీ చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల ఓడిపోయారు. ఆమెకు కేవలం 90 ఓట్లే వచ్చాయి. దీంతో రాజకీయాల నుంచి వెదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. 
ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇరోమ్ షర్మిల 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలియన్స్ (పీఆర్‌జేఏ) పార్టీ స్థాపించారు. 




రాష్ట్రాల వారీగా ఫలితాలు  :: 
ఉత్తరప్రదేశ్ ( మొత్తం సీట్లు 403 )
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
312
39.7 శాతం
47
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)
47
21.8శాతం
224
కాంగ్రెస్
07
6.2శాతం
28
బీఎస్పీ
19
22.2 శాతం
80
ఆర్‌ఎల్డీ
01
1.8శాతం
09
ఉత్తరాఖండ్ ( మొత్తం సీట్లు 70)
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
57
46.5
31
కాంగ్రెస్
11
33.5
32
బీఎస్పీ
00
7.0
03
యూకేకేడీ
00
0.7
01
మణిపూర్ ( మొత్తం సీట్లు 60)
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
21
36.3
00
కాంగ్రెస్
28
35.1
42
టీఎంసీ
01
1.4
07
ఎస్‌పీఎఫ్
04
7.2
04
ఎన్‌పీపీ
04
5.1
00
ఎల్‌జేపీ
01
2.5
01
ఎన్‌సీపీ
00
1.0
01
పంజాబ్ ( మొత్తం సీట్లు 117)
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
03
5.4
12
కాంగ్రెస్
77
38.5
46
ఆప్
20
23.7
--
ఎస్‌ఏడీ
15
25.2
56
గోవా ( మొత్తం సీట్లు 40 )
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
13
32.5
21
కాంగ్రెస్
17
28.4
09
జీపీఎఫ్
03
3.5
-
ఎంజీపీ
03
11.3
03
జీవీపీ
0
0.6
02
ఎన్‌సీపీ
01
2.3
-

తమిళనాడు జిల్లా మేజిస్ట్రేట్ పర్యావరణ తీర్పు :: బెయిల్‌పై విడుదలయ్యే వారు తప్పనిసరిగా వంద తుమ్మచెట్లు నరకాలని తమిళనాడులోని అరియలూరు జిల్లా న్యాయస్థానం మార్చి 15న వినూత్న తీర్పు ఇచ్చింది. బెయిల్‌పై వచ్చినవారు చెట్లు నరికినట్లుగా గ్రామ నిర్వాహక అధికారి నుంచి నివేదిక తీసుకుని సమర్పించాలని సూచించింది. 
గత కొన్నేళ్లలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా తుమ్మ చెట్లు విసృ్తతంగా పెరిగాయి. వీటి వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటడంతో పాటు గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీనిపై స్పందించిన మద్రాసు హైకోర్టు, మదురై హైకోర్టు బెంచ్‌లు భూగర్భజలాల పరిరక్షణ కోసం తుమ్మ చెట్లను తొలగించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాయి. దీంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అరియలూరు కోర్టు ఈ విషయంలో పర్యావరణ అనుకూల తీర్పుచెప్పింది. 

శత్రు ఆస్తుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం :: 1968 నాటి శత్రు ఆస్తుల (Enemy Properties) చట్టంలో సవరణలకు లోక్‌సభ మార్చి 14న ఆమోదం తెలిపింది. ఈ మేరకు సభలో ప్రవేశపెట్టిన శత్రు ఆస్తుల (సవరణ, చెల్లుబాటు) బిల్లు - 2016 మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీని ప్రకారం దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనాకు తరలివెళ్లిన వారి వారసులకు భారత్‌లో వదిలివెళ్లిన ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. అలాగే ఇక నుంచి ఈ ఆస్తులు ‘Custodian of Enemy Properties of India’ విభాగం అధీనంలో ఉంటాయి. 


రద్దయిన పాత నోట్లు పది కంటే ఎక్కువుంటే జరిమానా :: రద్దయిన రూ. 500, రూ. 1,000 నోట్లను 10 కంటే ఎక్కువ కలిగి ఉంటే ఇకపై జరిమానా పడుతుంది. ఈ మేరకు ఇలా కలిగి ఉండటాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ కేంద్రం తీసుకొచ్చిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్(సెసెషన్ ఆఫ్ లయబిలిటీస్) బిల్లు-2017కు ఫిబ్రవరి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీంతో అదే రోజు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది.

చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.10 వేలు, లేదా కలిగి ఉన్న నోట్ల ముఖ విలువకు ఐదు రెట్లు, వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. అధ్యయనం, పరిశోధన కోసం 25 నోట్ల వరకు ఉంచుకోవచ్చు.

రిషికేశ్‌లో 29వ అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ :: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 29వ అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ మార్చి 1న ప్రారంభమైంది. గంగానది ఒడ్డున వారం రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉద్దేశించి మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యోగా ఫెస్టివల్‌లో వెయ్యి మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 


తమిళనాడులో కోలా, పెప్సీలపై నిషేధం :: విదేశీ సంస్థలైన కోకా కోలా, పెప్సీ శీతల పానీయాల అమ్మకాలను నిషేధించాలని తమిళనాడు వర్తక సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిషేధాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అమెరికా సంస్థ అయిన పెటా వల్లే జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించిందన్నది తమిళనాడు వర్తక సంఘం ఆరోపణ. అందుకే అమెరికాకు చెందిన కోకా కోలా, పెప్సీ శీతల పానీయాలను రాష్ట్రంలో నిషేధించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

గ్రామాల్లో లింగ నిష్పతి 1,009 :: 2015-16 నాటికి దేశ వ్యాప్త లింగ నిష్పత్తి (ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 991గా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 1,009గా తేలింది. ఈ మేరకు 2015-16 సంవత్సరానికి నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 4 (NFHS-4) ఈ వివరాలు వెల్లడించింది. 

లింగనిష్పత్తి వివరాలు  :: 
  • జనన సమయంలో లింగనిష్పత్తి దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 914 నుంచి 919కి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో 899గా నమోదైంది.
  • ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో లింగనిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో 1,018కాగా పట్టణ ప్రాంతాల్లో 1,027 గా నమోదైంది. అదే జనన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 880 కాగా, పట్టణ ప్రాంతాల్లో 1,010 గా నమోదైంది.
  • తెలంగాణ మొత్తం జనాభాలో లింగనిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో 1,035కాగా పట్టణ ప్రాంతాల్లో 976 గా నమోదైంది. అదే జనన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 865 కాగా, పట్టణ ప్రాంతాల్లో 884 గా నమోదైంది.
  • హరియాణాలో జనన సమయంలో లింగ నిష్పత్తి 762 (2005-06) నుంచి 836కి పెరిగింది. అక్కడి గ్రామాల్లో మాత్రం ఇది 785కే పరిమితమైంది.

ప్రపంచంలోనే ఉన్న సింహాల్లో 70 శాతం భారత్‌లోనే :: ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 3న న్యూఢిల్లీలో ప్రపంచ వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ దవే మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మొత్తం సింహాల్లో 70 శాతం మేర భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. సుమారు దేశంలో 2400 సింహాలు ఉన్నాయని తెలిపారు.

కేంద్ర, సమగ్ర జీఎస్‌టీ బిల్లల ముసాయిదాకు ఆమోదం :: కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ), సమగ్ర జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) బిల్లుల తుది ముసాయిదాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ (11వ సమావేశం) జీఎస్టీ పరిధి నుంచి రైతులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం వ్యవసాయదారులు జీఎస్టీ కింద నమోదు కావాల్సిన అవసరం లేదు. ఏడాదికి రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులకు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. జీఎస్టీ ముసాయిదా చట్టంలో 40 శాతం వరకు పన్ను (కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం) విధించాలన్న నిబంధన ఉంటుందని, అయితే అమల్లోకి వచ్చే సగటు పన్ను రేట్లు గతంలో ఆమోదించిన 5, 12, 18, 28 శాతాలుగానే ఉంటాయని కేంద్రం పేర్కొంది. 

అత్తారీలో దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం :: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన అత్తారీలో దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకాన్ని మార్చి 5న ఆవిష్కరించారు. స్తంభం పొడవు 110 మీటర్లు (360 అడుగులు) కాగా బరువు 55 టన్నులు. జెండా పొడవు 120 అడుగులు, వెడల్పు 80 అడుగులు. పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి కూడా జెండాను చూడొచ్చు.

మొదట జార్ఖండ్ రాజధాని రాంచీలో దేశంలోనే ఎత్తయిన జాతీయ జెండాను (293 అడుగులు) నెలకొల్పారు. ఈ ఘనతను అధిగమిస్తూ తెలంగాణలోని హైదరాబాద్‌లో 300 అడుగుల ఎత్తయిన స్తంభం ఏర్పాటు చేశారు.


తొలి ప్లాస్టిక్ రహిత నగరంగా తిరువనంతపురం :: కేరళ రాజధాని తిరువనంతపురం దేశంలోనే తొలి ప్లాస్టిక్ రహిత నగరంగా నిలవనుంది. ఈ మేరకు నగర పాలక పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై మార్చి 1 నుంచి నిషేధాన్ని విధించింది. ఇకపై నగరంలో నిర్వహించే ఏ వేడుక, ఉత్సవంలోనూ ప్లాస్టిక్‌తో తయారయ్యే సంచులు, ప్లేట్లు, గ్లాసులు, పాలిథీన్ కవర్లను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. 


పంచాయతీల్లో లింగ సమానత్వానికి కేబినెట్ ఆమోదం :: పంచాయతీల్లో మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా భారత్-ఐక్యరాజ్యసమితి మధ్య జరిగిన అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ (మంత్రిత్వ శాఖ) ద్వారా పాలనా సంస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఎన్నికై న మహిళా ప్రతినిధుల సామర్థ్య నిర్మాణానికి, సాధికారత కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడతారు. మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నిర్ణయాలను అమలు చేస్తారు. 


ఐఐఎస్సీకి ప్రపంచ ఎనిమిదో ర్యాంకు ::యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) మార్చి 6న ప్రకటించిన ఉత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్‌‌సలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్సీ) 8వ ర్యాంకు సాధించింది. 2017లో ‘ఉత్తమ చిన్న విశ్వవిద్యాలయాలు’ విభాగంలో ఐఐఎస్సీకి ఈ ర్యాంకు దక్కింది. తద్వారా ప్రపంచ టాప్ 10 యూనివర్సిటీలో జాబితాలో తొలిసారి స్థానం దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయంగా ఐఐఎస్సీ గుర్తింపు పొందింది. 5 వేల మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలను చిన్న వర్సిటీలుగా పరిగణిస్తారు. 

మొదటి మూడు స్థానాల్లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా), ఎకోలే నార్మలే సుపీరియర్ (ఫ్రాన్‌‌స), పొహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (దక్షిణ కొరియా)లు ఉన్నాయి. 2015-16లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో టీహెచ్‌ఈ ప్రకటించిన టాప్ 100 వర్సిటీల్లో దేశం నుంచి మొదటి సారి ఐఐఎస్సీ చోటు దక్కించుకొని 99వ స్థానంలో నిలిచింది. 


వర్క్ ఫ్రం హోమ్ ప్రారంభించిన ఎస్‌బీఐ ::ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తూ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) మార్చి 7న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అత్యవసర సమయాల్లో మొబైల్ పరికరాల ద్వారా ఇంటి నుంచే విధులు నిర్వర్తించేందుకు తోడ్పడే ఈ విధానాన్ని బ్యాంక్ బోర్డు ఇటీవలే ఆమోదించింది. ఇందుకోసం ఉపయోగించే మొబైల్ డివైజ్‌లలోని యాప్స్, డేటా సురక్షితంగా ఉండేలా మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీలను వినియోగించుకోనుంది. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, ఫిర్యాదుల పరిష్కార అప్లికేషన్‌‌స మొదలైన వాటిని కూడా వర్క్ ఫ్రం హోమ్ సర్వీసుల్లో పొందుపర్చనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

దేశంలో మహిళల కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాంకు ఐసీసీఐ.